మొదలైన తెలంగాణా హడావిడి

డిసెంబర్ 31 తేది దగ్గర పడటముతో అటు సీమంద్రలోను, తెలంగాణా లోను నాయకుల హడావిడి మోదలైయీంది. దానికి తోడుగా ప్రభుత్వమూ కూడా కేంద్రమునుండి ప్రత్యెక బలగాలను రప్పించటం పరిస్తితులు ఉద్రిక్తము గా ఉండే అవకాసము ఉంది.

తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ విడుదల చేసే నివేదికపై న్యూస్ ఛానెల్స్ అతిగా స్పందించకూడదని న్యూస్ బ్రాడ్‌క్యాస్టర్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) కోరింది. శ్రీకృష్ణ కమిటీకి సంబంధించిన ఏ విషయాన్నైనా సంచలన రీతిలో ప్రసారం చేయడం కాని, రెచ్చగొట్టే విధంగా కాని ఉండకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని ఎన్‌బీఏలో సభ్యులైన ఎడిటర్లకు విజ్ఞప్తి చేసింది.
సమాజ శ్రేయస్సును, స్థానిక అంశాలను దృష్టిలో వుంచుకొని ప్రాథమిక మార్గదర్శక సూత్రాల కనుగుణంగా వార్తలు ప్రసారం చేయాలని న్యూస్ చానెల్స్‌ను కోరింది. అంతేకాక శ్రీకృష్ణ కమిటీ నివేదిక తదనంతర రేకేత్తే పరిస్థితులను, అనుకూల, ప్రతికూల ఊరేగింపులను, హింస దృశ్యాలను, స్క్రోలింగ్స్, ఆత్మాహుతి దృశ్యాలను చూపించకూడదని ఆంక్షలు విధించింది.
రేపు సీమంద్ర యునివర్సిటీ విద్యార్దుల ఐక్య కర్యచన సమితి బేటి కి పిలుపునిచారు, ఈ బేటి లో సీమద్రలో కృష్ణ కమిటీ రిపోర్ట్ మీద ఉద్యమ ప్రణాళికలు రచించ బోతున్నారు. రానున్న రోజులలో రాష్ట్రము మరల ఉద్యమాలతో ప్రజా జీవితానికి సంకటముగా మారబోతుంది!

Posted in Political | Tagged , | Leave a comment

మంత్రులే ప్రభుత్వాని డిమాండ్ చేయటమా !

తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వము మీద దాడికి రెడీ అవుతున్నారు, ఈ రోజు మద్యహనము జరిగిన తెలంగాణా కాంగ్రెస్ నాయకులు , MP , MLA , మరియు మంత్రులు సమావేసము జరిపేరు. సమావేసము ముగుసినతరువత CWC మెంబెర్, రాజ్యసభ మెంబెర్ , సీనియర్ నాయకుడు కే.కే మాట్లాడుతూ,విద్యార్థులు, ఉద్యమకారులపై పూర్తి స్థాయిలో కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రేపట్నుంచి అసెంబ్లీ ఎదురుగా వున్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం ముందు నిరవధిక నిరాహార దీక్ష నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు.
ప్రభుత్వము లో ఉన్న మంత్రులే ఇ లాంటి డిమాండ్ ని ఎలాగా సమర్ధిస్తారు? పరిపలించేది వాళ్ళేకదా మరి వల్లే శాంతి భద్రతులు కాపాడాలి.రాష్ట్ర కాబినెట్ తీసుకున్న నిర్యాన్ని అందులో భాగస్వాములు బయటికి వచ్చి అ డిమాండ్ కి ఎలాగా మద్దతు పలుకుతారు. అంటే వీళ్ళు రాజ్యాంగ నిర్ణయాన్ని వెతిరేకిస్తున్నారా ?  ముక్య మంత్రి కాని , గవర్నర్ కానీ ఎందుకు వీళ్ళని నియంత్రిన్చాలేకుండా ఉన్నారు. ప్రజాప్రతినిధులు కాని , నాయకులుగానీ వాళ్ళ ప్రాంత ప్రజల డిమాండ్ లకి అనుకూలంగా మాట్లాడితే ,లేదా ప్రభుత్వ నిర్ణయని వెతిరేకించ వచ్చు సాక్షాత్తు , ప్రభుత్వములో ఉన్న మంత్రులే సమిష్టినిర్ణయాన్ని వెతిరేకిస్తే , మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి పవిత్రత ఉంటుందా!

మన రాష్ట్రములో కేంద్ర నాయకత్వము తీసుకున్న అసమర్ధ నిర్ణయాల వలన గత సవంత్సరము నుండి ఆటు తెలంగాలోను, సీమంధ్రలోను రాజ్యగాస్పుర్తిని ఈ రాజకీయ నాయకులు కాలరాస్తున్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి ఎలాంటి సందేశాలు ఇవ్వాలి అనుకున్ట్టునారు. భవిష్యత్తులో జరిగే తీవ్ర పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వము సమాధానము చెప్పలిసి ఉంటుంది. మంత్రివర్గములో ఉంటూ మంత్రిమండలి నిర్ణయాన్ని, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వెతిరేకించే మంత్రులు రాజీనామా చేసి మాట్లాడితే ఆ ప్రాంత ప్రజలు హరిషిస్తారు, లేదంటే ఆలాంటి నాయకులు , ప్రభుత్వము తగిన ముల్యము చెల్లించాల్సి వస్తుంది.

Posted in Congress | Tagged , , , | Leave a comment

దిగ్విజయముగా ముగిసిన “లక్ష్య దీక్ష “

దిగ్విజయముగా ముగిసిన “లక్ష్య దీక్ష “

యువనాయకుడు, కడప మాజీ MP వై. యస్ . జగన్మోహన రెడ్డి రెండు రోజుల లక్ష్య దీక్ష లక్షలాది మంది రైతులు, చేనేత కార్మికులు, అభిమానులు మధ్య రైతన్న అందిచిన నిమ్మ రసము తో దిగ్విజయంగా ముగుసింది. కృష్ణ తీరము గత రెండు రోజులనుండి జన సంద్రము గా మరిపోయీంది.
ఈ సందర్బముగా నెల్లూరు MP మేకపాటి రాజమోహనరెడ్డి మాట్లాడతూ Dr వై యస్ రాజశేకర్ రెడ్డి దివంగతులు ఆయీనతరువత ఈ రాష్ట్రము లో అంతటి నాయకుడు జగన్మోహనరెడ్డి మాత్రమే, నెల్లూరు , ప్రకాశం జిల్లా లో జరిగిన ఓదార్పు యాత్ర ప్రత్యక్షంగా చుసిన తరువాత మాత్రమే నేను ఈ మాట చెబుతున్నఅని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సాయం సరిపోదని రైతులు భావిస్తున్నారన్నారు. ఇప్పటికి రాష్టవ్య్రాప్తంగా వందమంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని మేకపాటి అన్నారు. తమకు ఏ దిక్కులేదని మనస్తపం చెంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.

పెరిగిన MLA ల మద్దతు

జగన్మోహన రెడ్డి చేస్తున్నలక్ష్యదీక్షకు ప్రముఖుల మద్దతు పెరిగిపోతోంది. మూడో రోజు కూడా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు పలువురు శిబిరం వద్దకు వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరావు, చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, అనపర్తి ఎమ్మెలే శేషారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు,దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్ విజయమ్మలు గురువారం లక్ష్య దీక్షలో పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారుల మద్దతు

ఈ సందర్బముగా వచ్చిన ప్రతి రైతుకు, కార్మికులకు, నాయకులకు , అభిమానులకు జగన్ కృతజ్ఞతా తెలిపేడు.

Posted in Uncategorized | Leave a comment

Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!

Posted in Uncategorized | 1 Comment